
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్కు రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈ-డిప్కు 6 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. 1+3 విధానంలో మొత్తం 15.50 లక్షల మంది భక్తుల పేర్లు నమోదుచేసుకున్నారు. డిసెంబర్ 1వ తేది వరకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. 60 నుంచి 70 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుంటారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: WPL 2026 Auction: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ వీరే.. టాప్ 10లో నలుగురు మనోళ్లే!
వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులైన డిసెంబర్ 30, 31 అండ్ జనవరి 1వ తేదీలకు అందుబాటులో 1.76 లక్షల స్లాటెడ్ సర్వ దర్శన టోకెన్లు ఉన్నాయి. డిసెంబర్ 30కి 57 వేలు, డిసెంబర్ 31కి 64 వేలు, జనవరి 1కి 55 వేల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్లను డిసెంబర్ 2వ తేది ఈ-డిప్లో ఎంపికైన వారికి ఆన్ లైన్ ద్వారా కేటాయింపు చేస్తారు. టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా టోకెన్ల ఈ- డిప్ నమోదుకు అవకాశం ఉంది. టీటీడీ మొబైల్ యాప్ ద్వారా అత్యధికంగా 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు, 8.51 లక్షల పేర్లు భక్తులు నమోదు చేసుకున్నారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు, 5.75 లక్షల పేర్లు నమోదు కాగా.. వాట్సాప్ ద్వారా 39 వేల రిజిస్ట్రేషన్లు, 98వేల పేర్లు నమోదయ్యాయి.