
Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) శుభవార్త తెలిపింది. శబరిమలకు వెళ్లే మాలధారులు విమానాల్లో ‘ఇరుముడి’ తో ప్రయాణించొచ్చని తాజాగా వెల్లడించింది. విమానంలో కొబ్బరికాయలను స్వాములు తమ వెంట తీసుకెళ్లొచ్చని చెప్పింది.
READ ALSO: Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!
అయ్యప్ప స్వాముల నుంచి వచ్చిన వినతుల మేరకు, వారి సౌకర్యార్థం నిబంధనలను సడలించామని ఏఏఐ పేర్కొంది. ఈ నిబంధన అక్టోబర్ 28 (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నిబంధనల సడలింపు అనేది వచ్చే ఏడాది జనవరి 20 వరకు అమలులో ఉంటుందని తెలిపింది. అయ్యప్ప స్వాముల ప్రయాణం సాఫీగా, సేఫ్గా జరగడానికి కొబ్బరికాయలను క్యాబిన్లోకి తీసుకెళ్లే ముందు ఎక్స్ రే, ఎక్స్ప్లోజివ్ ట్రేస్ డిటెక్షన్ (ఈటీడీ), భౌతిక తనిఖీలు ఉంటాయని పేర్కొంది.
READ ALSO: PM Modi: ఉడుపి నాకు చాలా ప్రత్యేకమైంది.. గతాన్ని నెమరువేసుకున్న మోడీ