Lionel Messi : తెలంగాణకి మెస్సీ మెగా విజిట్.!

Messi Hyderabad Tour 2025 Revanth Reddy Invitation

Lionel Messi : ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ప్రతిభతో మంత్రముగ్ధులను చేసిన ఆర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్ రానున్నాడు. The G.O.A.T India Tour – 2025లో భాగంగా భారత పర్యటనకు సిద్ధమైన మెస్సీ, ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌ను సందర్శించనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారనుంది.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ ప్రమోషన్‌లో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన మెస్సీ, ఇండియాలో ఒక్క బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కే సంవత్సరానికి 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి సూపర్ స్టార్‌ను తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమానికి అనుసంధానం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పందిస్తూ.. “లియోనెల్ మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను. మన గడ్డపై ఆయనను చూడాలని ప్రతి ఫుట్‌బాల్ అభిమాని కలలు కన్న క్షణం ఇది. హైదరాబాద్ అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. డిసెంబర్ నెలలో జరగబోయే ఈ టూర్, రాష్ట్రానికి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే కీలక ఘట్టంగా మారనుంది. మెస్సీ రాకతో హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్ మరింత పెరుగనుంది.

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌