
వామ్మో.. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఆ మధ్య రెండు రోజులు ధరలు తగ్గాయి. దీంతో ధరలు దిగి రావొచ్చని పసిడి ప్రియులు భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా గోల్డ్ లవర్స్కు షాకిస్తున్నాయి. శనివారం మరోసారి భారీ పెరిగిపోయాయి. తులం గోల్డ్పై రూ.1,360 పెరగగా.. కిలో వెండిపై మాత్రం రూ.9,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Hong kong Fire: హాంకాంగ్ విషాదం వెనుక దిగ్భ్రాంతికర విషయాలు.. ఓ కార్మికుడు ఏం చేశాడంటే..!
బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,360 పెరిగి రూ.1,29,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,250 పెరిగి రూ.1,19,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,030 పెరిగి రూ.97,370 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Udaipur Wedding: వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు.. ఈడీ అదుపులో ర్యాపిడో డ్రైవర్!
ఇక వెండి ధర భారీ షాకిచ్చింది. 2లక్షలకు చేరువ దిశగా దూసుకుపోతుంది. కిలో వెండిపై ఏకంగా రూ.9,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్లో మాత్రం రూ.1,92,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,85, 000 దగ్గర అమ్ముడవుతోంది.